TS RGUKT IIIT Basara 2025: 480-550 మార్కులు వచ్చినవారికి సీట్ వస్తుందా?

TS RGUKT IIIT Basara 2025 Admissions:

తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర త్రిబుల్ ఐటీ లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సుల కోసం ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుంది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా బాసర త్రిబుల్ ఐటీ లో ప్రవేశాలు పొందవచ్చు. అయితే పదవ తరగతిలో 480 నుండి 550 మధ్య మార్కులు వచ్చిన వారికి త్రిబుల్ ఐటీ బాసరలో సీటు వస్తుందా లేదా అనే పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

10th లో 480 నుండి 550 మార్కులు వచ్చిన వారికి IIIT బాసరలో సీటు వస్తుందా?:

పదో తరగతిలో వచ్చిన ఒక్కో మార్కును GPA గా కన్వర్ట్ చేస్తే , 480 నుండి 550 మధ్య మార్కులు వచ్చిన వారికి, సుమారుగా 9.2GPA నుండి 10GPA మధ్య ఉంటుంది. మీరు గ్రామీణ ప్రాంతం, తెలంగాణలోని రిజర్వేషన్ కోటా (SC, ST, BC) కింద ఉంటే, అలాగే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల నుండి చదివినట్లయితే, 0.4 Deprivation Score కూడా కలుస్తుంది.

Join WhatsApp group

అందువల్ల మీరు SC, ST, BC కులానికి చెందిన విద్యార్థి అయితే, 480 నుండి 550 మార్కులతో మీకు సీట్ రావడం జరుగుతుంది. అయితే OC/GENERAL అభ్యర్థులకు పోటీ ఎక్కువగా ఉండటంతో వారికి 9.8GPA నుండి 10GPA మార్కులు రావాల్సి ఉంటుంది.

10వ తరగతిలో 600 కి ఎన్ని మార్కులు వచ్చిన వారికి IIIT బాసరలో సీటు వస్తుంది: Cut Off Ranks

గత సంవత్సరం అనుభవం ఆధారంగా IIIT బాసరలో సీటు వచ్చిన వివరాలు:

MarksExpected GPACategorySeat Chances
55010.0Generalఉంది (చాలా పోటీ)
5209.6SC/ST/BCమంచి అవకాశాలు ఉన్నాయి
5009.3ST Govt. స్కూల్చాలా మంచి ఛాన్స్ ఉంది
4809.1ST Govt. స్కూల్అవకాశం ఉంది

IIIT బాసర 2025 ఫలితాలు విడుదల తేదీ?:

తెలంగాణలోని త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రం నాటికి విడుదల చేయనున్నారు. దాదాపుగా 50 వేల మంది వరకు విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసర అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఫలితాలు విడుదల చేసిన తర్వాత మెరిట్ లిస్టులో విద్యార్థుల యొక్క పేరు ఉన్నట్లయితే వారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కి అటెండ్ కావలసి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు కాలేజీలో రిపోర్టింగ్ ఇచ్చి తరగతులకు హాజరు కావాలి.

TS RGUKT IIIT Basara 2025 Results: Download Here

మీరు పదో తరగతిలో 480 నుండి 550 మార్కుల మధ్య తెచ్చుకొని త్రిబుల్ ఐటీ బాసర 2025 అడ్మిషన్స్ కి దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీరు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులానికి చెందినటువంటి విద్యార్థి అయినట్లయితే బాసర త్రిబుల్ ఐటీ లో సీటు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి సంవత్సరం పెరుగుతున్నటువంటి పోటీ కారణంగా, వచ్చినటువంటి దరఖాస్తులను ఆధారంగా చేసుకొని సీటు పొందే అవకాశాలలో మార్పులు ఉండవచ్చు.

జూలై 4వ తేదీన ఫలితాలు విడుదల చేనున్నారు కాబట్టి విద్యార్థులు ప్రతిరోజూ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి.