Annadhatha Sukhibhava Scheme 2025: 47.77 లక్షల రైతుల అకౌంట్ లో డబ్బులు జమ – అర్హుల జాబితా చూసుకోండి

Annadhatha Sukhibhava Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోఫా సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు, ఇంకా 61 వేల మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి ఢిల్లీ రావు శుక్రవారం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని జూలై నెలలో అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పథకం ముఖ్యమైన అంశాలు :

  • 98% రైతులకు ఆధార్ మరియు భూమి వివరాలు యొక్క లింక్ పూర్తయింది
  • మొత్తం 61 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
  • మొదటి విడతగా 47.77 లక్షల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు.
  • ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్న ప్రభుత్వం

Join WhatsApp group

ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి?:

  • రైతు సోదరులకు పంట సాగు కోసం ముందస్తుగానే ఆర్థిక సహాయం అందిస్తారు
  • వ్యవసాయ ఇన్పుట్స్ కొనుగోలు కోసం సహాయపడడం
  • భీమా, సాగు పరికరాలు, రైతు బజార్లు మొదలైన వ్యవసాయ అంశాలకు ప్రోత్సాహకం
  • పంట సాగుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించడం.

ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల మంజూరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం: Apply

పథకం అమలు చేసే టైంలైన్ ఇదే:

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 20వేల రూపాయలు జమ చేయనున్నారు. అయితే ఈ డబ్బులను మూడు విడతల్లో జమ చేయనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు విడతలకి సంబంధించిన టైం లైన్ ఈ క్రింది విధంగా ఉంది.

ఏపీ నిరుద్యోగ భృతి ప్రారంభ తేదీ వచ్చేసింది : ఎలా అప్లై చేయాలి

  • 2025 జూలై : రాబోయే జూలై నెలలో మొదటి విడత కింద ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు
  • 2025 అక్టోబర్ : అక్టోబర్ నెలలో రెండో విడత డబ్బులను జమ చేస్తారు.
  • 2026 జనవరి: మూడో విడత డబ్బులను మిగిలినటువంటి రైతులందరికీ ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి డబ్బులు జమ పూర్తి చేస్తారు.

భూమిలేని కౌలుదారులకు శుభవార్త :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిలేని కౌలుదారులకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. భూమిలేని ఓసి, బీసీ,ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు డబ్బు జమ్ము కావాలి అంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదు కావాలని సూచించారు.

ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా విడుదల: Check Here

లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అనే లబ్ధిదారుల జాబితాని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంపాదించి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
  2. అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మూడు విడతల్లో మీ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది.

అధికారిక ప్రకటనలో వ్యవసాయ కార్యదర్శి ఏమన్నారు?:

వేరే రాష్ట్రాల నుండి వచ్చిన రైతుల యొక్క వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉందని, వీలైనంత త్వరగా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయం బలపడాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మీడియాకు తెలిపారు.

ముఖ్యమైన గమనిక:

ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టేటస్ చెక్, లబ్ధిదారుల జాబితా వంటి వివరాలు త్వరలో అధికారికి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.