TS EAMCET 2025 Admissions:
తెలంగాణ ఎంసెట్ 2025 ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు, రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను జూన్ చివరి వారంలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడన్నప్పటికీ ఈరోజు వచ్చినటువంటి సమాచారం ద్వారా నెలా కొరకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించనున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సుమారు 178 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో భాగం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ మరియు కావలసిన సర్టిఫికెట్ల వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది?:
- JEE Mains /TS EAMCET 2025 ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయి
- కొన్ని టాప్ కళాశాలలో డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా (Management Quota) కూడా అడ్మిషన్లు అందిస్తున్నాయి
- ఇంటర్ విద్యార్థులు తమ ఇంటర్ మార్కుల ఆధారంగా కొన్ని కళాశాలల్లో లీటల్ ఎంట్రీ ద్వారా ( 2nd year direct admission) కూడా జాయిన్ అవుతున్నారు.
ఎక్కువ కళాశాలలు ఉన్న జిల్లాలు:
హైదరాబాద్ , రంగారెడ్డి, వరంగల్ , ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలో ఎక్కువగా మంచి కళాశాలలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రభుత్వ కళాశాలలో కొత్త కోర్సులను ప్రారంభించమన్నారు.
తెలంగాణలో బీటెక్ మొదటి సంవత్సర క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీ: Click Here
ఈ డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోండి?:
ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రక్రియకు అవసరమైన ముఖ్యమైనటువంటి సర్టిఫికెట్స్ :
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- TC & బోనఫైడ్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- ఇన్కమ్ సర్టిఫికెట్
- JEE/EAMCET ర్యాంక్ కార్డ్
- ఆధార్ కార్డ్
ముఖ్యమైన సమాచారం:
- ఈ నెలాఖరు నాటికి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రసరత్తు ప్రారంభించింది.
- మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, లీటల్ ఎంట్రీ (Diploma To BTech) అడ్మిషన్లు జరగనున్నాయి.
- మొదటి దశలో 14 విభాగాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ప్రవేశాలను నిర్వహించనున్నాయి.
ఫీజులు విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా?:
ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఫీజులు విషయంలో భరోసాని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ అడ్మిషన్స్ & ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC ) 2025-26, 2026-27, 2027-28 సంబంధించి ఫీజు వివరాలను వెల్లడించింది.