రాజీవ్ యువ వికాసం అర్హులు జాబితా: మొత్తం ఐదు విడతల్లో నిధులు మంజూరు: జాబితా ఎలా చూసుకోవాలి

TS Rajiv Yuva vikasm Scheme 2025:

తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం జూన్ 2వ తేదీన అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రారంభించాలని భావించిన ప్రభుత్వం కొద్దిరోజులపాటు అభ్యర్థులకు మంజూరు పత్రాలు జారీ వాయిదా వేసింది. ఈ పథకానికి 16.23 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇన్ని లక్షల్లో దరఖాస్తులు వచ్చినందున చాలా జాగ్రత్తగా అర్హులైనటువంటి అభ్యర్థులను పరిశీలించి, ఖచ్చితమైన అర్హత కలిగినటువంటి వారికే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అభ్యర్థులకు నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మరికొద్ది రోజులు సమయం తీసుకుని అర్హుల జాబితాను చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి, ఈ పథకాన్ని పునః ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను ఏ విధంగా చూసుకోవాలనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పథకానికి ఎవరు అర్హులు?:

  1. తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరం
  2. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
  3. కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మెంచకుండా ఉండాలి
  4. విద్యార్హతల్లో కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి

Join Whats App Group

ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు:

  • మొత్తం వచ్చిన దరఖాస్తులు: 16,23,643
  • క్లియర్ చేసిన దరఖాస్తులు: 15,53,551 (95.68%)
  • బ్యాంకుల పరిశీలనకు పంపించినవి: 13,83,950 (85.24%)
  • బ్యాంకులు అంగీకరించినవి : 8,93,219 (55.01%)

ఎంత మొత్తం చెల్లిస్తారు?:

నిరుద్యోగులకు మొత్తం ఐదు విడతల్లో అర్హులైనటువంటి వారికి ఫేసుల వారీగా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఈ నెలలో ఎంత మొత్తం చెల్లిస్తారో ఈ క్రింది చిత్రంలో ఉన్న వివరాలు ద్వారా తెలుసుకోండి.

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ

అర్హుల జాబితా ఎలా చెక్ చేయాలి?:

  1. ముందుగా రాజీవ్ యువ వికాసం వెబ్సైట్ https://tgobmmsnew.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  2. అధికారిక వెబ్సైటు పంపేజీలో ” Rajiv Yuva Vikas scheme 2025” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. Registered applicants printout “ లేదా ” application status” ఆప్షన్ ని ఎంచుకోండి
  4. మీ ఆధార్ నంబర్ లేదా దరఖాస్తు ఐడిని ఎంచుకోండి.
  5. సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  6. మీ దరఖాస్తు యొక్క స్థితి మరియు అర్హత వివరాలను చూసుకోండి.

ప్రస్తుతం పథకం యొక్క అర్హుల జాబితా విడుదల ప్రక్రియ పునః పరిశీలనలో ఉంది. ప్రభుత్వం త్వరలోనే అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితా వివరాలను వెల్లడిస్తారు. ఆ వివరాలు కోసం ప్రతిరోజు అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.

Rajiv Yuva Vikasam Website

మంజూరు పత్రాల విడుదలలో ఆలస్యం ఎందుకు?:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కి సంబంధించి ఖచ్చితమైన అర్హులను ఎంపిక చేయడానికి, రీ వెరిఫికేషన్ ప్రక్రియ చేయడానికి కొద్ది రోజులపాటు అర్హుల మంజూరు పత్రాల జారీ వాయిదా వేసింది. కొన్ని కాంట్రాక్ట్ మరియు టెక్నికల్ అంశాలపై పర్సనల్ జరుపుతున్నారు. త్వరలో అర్హులైన వారికి మంజూరు పత్రాలను జారీ చేస్తారు.